Sri Venkateswara Swamy Vari Devasthanam | Vadapalli

ఆలయ చరిత్ర :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గల తూర్పు గోదావరి జిల్లానందు గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక గ్రామం 'వాడపల్లి'. ఈ గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ప్రసిద్ధి చెందినది, ఈ దేవస్థానాన్ని 'వాడపల్లి వెంకటేశ్వర స్వామి' దేవస్థానం అని కూడా పిలుస్తారు.

ఈ ఆలయం, చాల గొప్ప చరిత్ర కలిగి ఉంది మరియు తదనంతర కాలంలో విశాలమైన ప్రాంగణంలో అభివృద్ధి చే శారు. ఆలయం చుట్టూ ఉన్న పైకప్పు భాగాన 'గోవిందనామాలు' ముద్రించారు, ఆ నామాలు ప్రదక్షిణ చేసే భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి శనివారం ఆలయానం దగ్గర సుమారు అర్ధ కిలోమీటరు పొడవున మేళగా అన్ని దుకాణాలు ఏర్పాటుచేస్తారు. ఈ క్షేత్రం లో ఏడు శనివారాలు దర్శించుకొని, పదకొండు ప్రదక్షణలు చేసిన భక్తుల కోరికలు స్వామి వారు నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తారు. కావున శనివారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.


ఎర్ర చందన కొయ్యలో వెలసిన 'స్వయంభూ' క్షేత్రం 'వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి' వారి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 'కళ్యాణ వేంకటేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. స్వామి వారి 'బ్రహ్మోత్సవం' పది రోజులపాటు అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. ప్రతి రోజు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు స్వామి వారి దర్శించుకుంటారు మరియు బ్రహ్మోత్సవ సమయంలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ ఆలయంలో 'గోదా దేవి' కళ్యాణం నిర్వహిస్తే అవివాహితులకు వివాహం అవుతుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం.

ఆలయం గురించి :
వాడపల్లి 'శ్రీ వెంకటేశ్వర స్వామి' వారి దేవస్థానం చాలా పురాతన ప్రసిద్ధ హిందూఆలయాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం స్వామి వారి తీర్థం దగ్గర వార్షిక వేడుకలను మార్చ్-ఏప్రిల్ నెలల్లో చాలా ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది మరియు వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. వాడపల్లి, తూర్పు గోదావరి జిల్లానందు గోదావరి నది ఒడ్డున రావులపాలెంకి 10 కి. మీల దూరంలో కలదు. రావులపాలెంకు అన్ని ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. ఎర్ర చందన కొయ్యలో వెలసిన స్వయంభూ క్షేత్రం వాడపల్లి, 'శ్రీ వెంకటేశ్వర స్వామి' వారి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 'కళ్యాణ వేంకటేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. ప్రతి శనివారం చాలా ప్రాంతాల నుండి ఇక్కడకు భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రతి శనివారం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరుపబడును. ఈ క్షేత్రం 'కోనసీమ తిరుపతిగా' ప్రఖ్యాతి గాంచినది.

ఆలయ సమయాలు:
ఆదివారం నుండి శుక్రవారం వరకు ఉ.6:00 గం. ల నుండి మ.12:00 గం. ల వరకు మరియు సా.4:00 గం. ల నుండి రా.8:00 గం. ల వరకు తెరచి ఉంటుంది.
శనివారం: ఉ.4:00 గం. ల నుండి మ.2:00 గం. ల వరకు మరియు సా.4:00 గం. ల నుండి రా.8:00 గం. ల వరకు తెరచి ఉంటుంది.

రవాణా :
By Road:
వాడపల్లి రావులపాలెం నుండి 11 కి. మీల దూరంలో కలదు, మరియు రావులపాలెం రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పట్టణాలతో అనుసంధానమైంది కావున బస్సు సౌకర్యం కలదు.

By Train :
ఆలయానికి దగ్గరగా నిడదవోలు జంక్షన్ 30 కి. మీలు మరియు తణుకు 38 కి.మీల దూరంలో రైల్వే స్టేషన్స్ కలవు.


By Air:
విజయవాడ జాతీయ విమానాశ్రయం, గన్నవరం దగ్గర, ఆలయానికి 149 కి. మీల దూరంలో కలదు.

సంప్రదించండి :
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం,
వాడపల్లి, తూర్పు గోదావరి జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్ - 534 350

vadapalli venkateswara songs, vadapalli venkanna babu temple, ravulapalem to vadapalli, how to reach vadapalli temple, vadapalli temple history, vadapalli temple abhishekam timings, rajahmundry to vadapalli temple distance, vadapalli venkateswara swamy temple history in telugu, vadapalli venkateswara swamy temple eo phone number, vadapalli venkanna babu temple, rally temple timings, vadapalli temple online ticket booking.

Comments

Popular Posts